హైదరాబాద్​లో రెండు మెట్రో స్టేషన్ల పేర్లు మార్పు

హైదరాబాద్​లోని రెండు మెట్రో స్టేషన్ల పేర్లు మార్పు చేసారు. మెట్రో రైలు ప్రాధాన్యతను ప్రజలకు వివరించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్ మెట్రోతో ఎస్‌బీఐ ఒప్పందం చేసుకొంది.

ఇందులో భాగంగానే మాదాపుర్‌లోని హైటెక్‌సిటీ, బేగంపేట మెట్రోస్టేషన్ల పేర్లు, బ్రాండింగ్ హక్కులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దక్కించుకుంది. దీని ప్రకారం హైటెక్‌సిటీ, బేగంపేట పేర్ల ముందు ఎస్‌బీఐ పేరు చేర్చారు ఇక నుంచి ఈ స్టేషన్ల పేర్లు ఎస్​బీఐ హైటెక్​సిటీ మెట్రో స్టేషన్, ఎస్​బీఐ బేగంపేట్ మెట్రో స్టేషన్లుగా మారిపోనున్నాయి.