కేసీఆర్ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలి బండి సంజయ్

bandy sanjay tweet about on kcr health

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుప్రతిలో చేరిన విషయం తెలిసింది. కెసిఆర్ అస్వ‌స్థ‌త‌కు గురికావడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారని సీఎంఓ కూడా ప్రకటించింది. అయితే ఈవిషయం పై బీజేపీ బండి సంజయ్ స్పందించారు. “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురి చేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని బండి సంజ‌య్ ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/