సిట్‌ ఎదుట హాజరుకాబోతున్న బండి సంజయ్ లీగల్ టీం

TSPSC పేపర్ లీక్ వ్యవహారం లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన ఆరోపణల ఫై సిట్ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ సంజయ్ మాత్రం సిట్ ఎదుట హాజరుకావడం లేదు. సిట్ ఫై నమ్మకం లేదని అందుకే తన వద్ద ఉన్న ఆధారాలు చూపించలేకపోతున్నాని తెలిపారు. ఈ క్రమంలో మరోసారి సిట్ అధికారులు విచారణ హాజరుకావాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో మార్చి 26న సిట్ విచారణకు బండి సంజయ్ లీగల్ టీం హాజరుకానుంది.

మరో వైపు పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను రెండోసారి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ అధికారులకు నాంపల్లి కోర్టు అనుమతి ఇచింది. ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ ను కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సిట్ అధికారులు మూడు రోజుల పాటు నలుగురు నిందితులను విచారించనున్నారు.