మంత్రి గంగుల యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారు – బండి సంజయ్

బిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ఫై కీలక ఆరోపణలు చేసారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ లో సంజయ్ మాట్లాడుతూ..మంత్రి గంగుల కమలాకర్ యువతను గంజాయి మత్తులో ముంచుతున్నారని .. తనను ఓడించేందుకు ఓటుకు రూ. 10 వేలు పంచేందుకు గంగుల సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. గంగుల కమలాకర్ మళ్లీ గెలిస్తే జీతాలు, పెన్షన్లు రావని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఓటమి ఖాయమని కేసీఆర్‌కు ఎప్పుడో తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలది భూకబ్జాలు, అతినీతి లొల్లి.. ఇసుక కుప్పలు కనిపిస్తే చాలు బీఆర్ఎస్ నేతలు డబ్బులు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు.

అలాగే కరీంనగర్‌లో చెల్లని రూపాయి హుస్నాబాద్‌లో చెల్లుద్దని పొన్నం ప్రభాకర్ ఇక్కడకు వచ్చాడా అంటూ పొన్నం ఫై సెటైర్లు వేసాడు సంజయ్. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తే బీఆర్ఎస్‌లో నలుగురు సీఎం పదవి కోసం కొట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరూ ముఖ్యమంత్రులే అని సంజయ్ ఎద్దేవా చేసారు.

’30 వేల కోట్ల రూపాయలతో అయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష 30 వేల కోట్లకు పెంచి కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారు. రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఎవరైనా నిరుద్యోగుల కోసం కొట్లాడి జైలుకు పోయారా. పొన్నం ప్రభాకర్ ఎప్పుడైనా జైలుకెళ్లాడా, లాఠీ దెబ్బలు తిన్నాడా నేను లాటి దెబ్బలు తిన్నాను, జైలుకెళ్లాను. తిండికి లేని కేసీఆర్ కుటుంబానికి ఇవాళ లక్షల కోట్లు ఎలా వచ్చాయి’’ అని బండి సంజయ్ ప్రశ్నించారు.