దైవకార్యాన్ని రాజకీయం చెయ్యద్దు.. 22 సెలవు ప్రకటించండిః బండి సంజయ్

bandi-sanjay

హైదరాబాద్‌ః అయోధ్య రామ మందిరం సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించమని బిజెపి నేత బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని అన్నారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం దేశమంతా ఎదురు చూస్తున్నారని, ఇంతటి దైవకార్యాన్ని రాజకీయం చేయొద్దని చెప్పారు. శ్రీరాముడు బిజెపికి మాత్రమే దేవుడు కాదని బిజెపికి మాత్రమే అన్నట్టు వివాదాస్పదం చేయడం సరికాదని చెప్పారు బండి సంజయ్. అటు ఏపీ లో కూడా సెలవుని ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. అయితే జనవరి 22 నయోధ్య రాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా పలు రాష్ట్రలు సెలవు ప్రకటించిన విషయం మనకి తెలుసు బండి సంజయ్ దైవకార్యాన్ని చెయ్యొద్దు సెలవుని ప్రకటించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.