గన్నవరం ఎయిర్ పోర్ట్ లో రజనీకాంత్ కు ఘనస్వాగతం పలికిన బాలకృష్ణ

టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు నేడు విజయవాడలోని పోరంకిలో జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా ఆయనకు నందమూరి బాలకృష్ణ ఘన స్వాగతం పలికారు.

బాలకృష్ణ ను చూడగానే ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రజనీకాంత్…ఎలా ఉన్నారంటూ పరస్పరం పలకరించుకున్నారు. ఒకే కారులో నోవోటెల్ కు వెళ్లిన రజనీకాంత్ – బాలయ్య… ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు వచ్చినందుకు రజనీకాంత్ కు కృతఙతలు తెలిపారు.

ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి రజనీకాంత్ రానున్నారు. తేనేటి విందు అనంతరం అక్కడి నుంచి రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ , చంద్రబాబు కుటుంబసభ్యులు.. అందరూ కలిసి సాయంత్రం ఐదు గంటలకు ఉండవల్లి నివాసం నుంచి పోరంకి అనుమోలు గార్డెన్స్‌లో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభ వద్దకు వెళ్ళనున్నారు.