హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన

దాదాపు పది నెలల తర్వాత హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పర్యటించబోతున్నారు. గత కొద్దీ నెలలుగా నియోజకవర్గ ప్రజలు బాలయ్య ఫై ఆగ్రహం తో ఉన్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని , అభివృద్ధి ఫై దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు. ఇదే విషయాన్నీ టీడీపీ క్యాడర్ బాలకృష్ణ దృష్టి కి తీసుకెళ్లడం తో..నియోజకవర్గంలో పర్యటనకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు బాలయ్య పర్యటనకు గట్టిగా ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు.

హిందూపురం టీడీపీ మండల కన్వీనర్ అశ్వత్ రెడ్డి కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు బాలకృష్ణ హాజరు కానున్నారు. ఆ తర్వాత అదే రోజు జనసేన, టిడిపి సమన్వయ సమావేశంలో పాల్గొంటారు. రెండు పార్టీల నేతలతో బాలయ్య మాట్లాడి కీలక సందేశాన్ని ఇవ్వనున్నారు. బాలయ్య తన నియోజకవర్గం వైపు తొంగిచూడకపోవడంతో వైసీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజలను పట్టించుకోడని విమర్శలు గుప్పించారు. అలాగే ఈసారి ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తే అస్సలు గెలవలేడని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతల మాటలకు పుల్‌స్టాప్ పెడుతూ బాలకృష్ణ తన నియోజకవర్గంలో పర్యటించనున్నారు.