రేపు కాంగ్రెస్‌ లో చేరనున్న విజయశాంతి ?

బిజెపికి విజయశాంతి రాజీనామా

vijayashanthi-to-join-congress-soon

హైదరాబాద్‌ః బిజెపి పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కిషన్‌ రెడ్డికి పంపించారు . అయితే విజయశాంతి రేపు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారట. రేపు తెలంగాణకు రాహుల్‌ గాంధీ రానున్నారు. ఈ తరుణంలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. అలాగే… సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా పెట్టారు రాములమ్మ. తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు.

ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదేనని వివరించారు. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరన్నారు. అది, ఎప్పటికీ నిరూపితమైన వాస్తవం అని వివరించారు. అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుంచి వచ్చి.. ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం ఎంత మాత్రం సరికాదని ఫైర్‌ అయ్యారు.

కాగా, విజయశాంతి త్వరలో తమ పార్టీలో చేరుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఇటీవల అన్నారు. బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఆమె పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల పరేడ్ మైదానంలో జరిగిన… నరేంద్ర మోడీ పాల్గొన్న మాదిగల విశ్వరూప సభకు హాజరు కాలేదు. నిన్న ఫేస్ బుక్, ఎక్స్ ప్రొఫైల్ పిక్ మార్చారు. ఈ రోజు రాత్రి ఆంధ్రా ప్రజలు ఓకే కానీ, ఆంధ్రా పార్టీలను ప్రజలు నమ్మరని ట్వీట్ చేయడం గమనార్హం.