గుంటూరులో ఘోరం : మహిళా వాలంటీర్‌పై మున్సిపల్ చిందులు..

సాటి మహిళ అని కూడా చూడకుండా తోలు తీయిస్తా..ఉద్యోగం తీసిపడేస్తా.. పోయి ఎమ్మెల్యేకు చెప్పుకోమంటూ మహిళా వాలంటీర్‌పై చిందులేశాడు నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి. 3వ వార్డు వాలంటీర్ అక్తర్ పిల్లలకు అన్నం పెట్టేందుకు ఇంటికి వెళ్లింది. ఆలా వెళ్లిందో లేదో వెంటనే రామచంద్రారెడ్డి ఆమెకు ఫోన్ చేసి ఐదు నిమిషాల్లో సచివాలయంలో ఉండాలని హెచ్చరించాడు. వెంటనే ఆమె ఆఘమేఘాల మీద సచివాలయానికి వచ్చింది.

ఆలా రాగానే ఆమెపై ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేసాడు. ఆమె చెప్పేది ఏమాత్రం వినిపించుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడాడారు. నిమిషాల్లో లోపల వేయించి తోలు తీయిస్తానని..ఉద్యోగం తీసిపడేస్తా.. పోయి ఎమ్మెల్యేకు చెప్పుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ సీన్ మొత్తం ఎవరో మొబైల్‌లో రికార్డు చేశారు. కమిషన్ తీరుపై వాలంటీర్ ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమీషనర్ తనకు ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారని ఆమె ఆరోపిస్తున్నారు.