తారకరత్న పేరుతో గుండె సమస్యలకు బాలకృష్ణ ఉచిత వైద్యం..

తారకరత్న పేరుతో గుండె సమస్యలకు బాలకృష్ణ ఉచిత వైద్యం అందించబోతున్నట్లు ప్రకటించారు. నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18 న కన్నుమూసిన సంగతి తెలిసిందే. గుండెపోటుకు గురై దాదాపు 23 రోజుల పాటు మృతువు తో పోరాడిన తారకరత్న ..చివరికి మృతువు నుండి బయటపడలేకపోయారు. తారకరత్న మృతి తో నందమూరి ఫ్యామిలీ విషాదంలో మునిగింది. ముఖ్యంగా తారకరత్న మరణం బాలకృష్ణ తట్టుకోలేకపోయారు. తారకరత్న హాస్పటల్ లో జాయిన్ అయ్యిన దగ్గరి నుండి ఆయన్ను బ్రతికించాలని ఎంతో తహతహలాడాడు. కానీ తారకరత్న మాత్రం తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయాడు. మరణానంతరం కూడా అన్ని కార్యక్రమాలను బాలకృష్ణ దగ్గరుండి తానే అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు తారకరత్న కుటుంబానికి కూడా ఆయనే పెద్ద దిక్కుగా మారారు. తారకరత్న భార్య, పిల్లలకు… మీకు నేను ఉన్నాను అంటూ అండగా నిలబడ్డారు.

ఇదిలా ఉంటె ఇప్పుడు తారకరత్న జ్ఞాపకార్థం బసవతారకం ఆసుపత్రిలో ఒక వార్డుకు తారకరత్న పేరును బాలకృష్ణ పెట్టారు. గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఈ వార్డులో ఉచితంగా వైద్య సేవలను అందించనున్నట్టు బాలకృష్ణ ప్రకటించారు. బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అలేఖ్య రెడ్డి కూడా పోస్ట్ పెడుతూ..” నేనేం మాట్లాడగలను.. మిమ్మల్ని బంగారు బాలయ్య అని పిలవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు… మీరు మాకు తండ్రి , స్నేహితుడు కంటే ఎక్కువ.. ఇప్పుడు మీలో దేవుడిని చూస్తున్నాను.. జై బాలయ్య..” అంటూ అలేఖ్య రెడ్డి పోస్ట్ పెట్టారు.