బజాజ్ పల్సర్ 150 బీఎస్-6 బైక్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ బుధవారం బీఎస్-6 మోడల్ బైక్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. యూత్లో మంచి క్రేజ్ ఉన్న బజాజ్ పల్సర్ 150 బీఎస్-6 మోడల్ బైక్ను తాజాగా విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.94,956 (ఢీల్లీ ఎక్స్్ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. పల్సర్ 150, 150 ట్విన్ డిస్క్ వేరియంట్లలో ఈ బైక్ తీసుకొచ్చారు. మొదటి వేరియంట్ పల్సర్ 150 ధర రూ. 94,956, ట్విన్ డిస్క్ ధర రూ. 98,835గా ఉంటుందని సంస్థ పేర్కొంది. బీఎస్ 4 వాహనాలతో పోలిస్తే బీఎస్-6 ద్విచక్రవాహనాల ధర దాదాపు రూ.8998 పెరిగినట్లు సంస్థ తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని బీఎస్-6 వాహనాలను తీసుకురానున్నట్లు కంపెనీ బైక్ విభాగ ప్రెసిడెంట్ సరంగ్ కనడే తెలిపారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/