తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఫై దాడి..

హైదరాబాద్ ఫిర్జాదిగూడలోని తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. కర్రలు, రాడ్లతో విధ్వంసం సృష్టించారు. ఆదివారం మధ్యాహ్నం మరణ యుధాలతో వచ్చి ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్, కంప్యూటర్, అద్దాలను పగలగొట్టారు. మంత్రి మల్లారెడ్డి కి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేస్తే చంపేస్తామని బెదిరించారు. దాదాపు 25 మంది గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఘటనపై మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు తీర్మార్ మల్లన్న.. క్యూన్యూస్ ఆఫీస్ కి చేరుకున్న పోలీసులు..ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకొని స్థానికులు చితకబాదినట్లు తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్, కవిత అనుచరులే తమపై దాడికి పాల్పడ్డారని మల్లన్న టీమ్ తెలిపింది. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లన్న టీమ్ డిమాండ్ చేస్తోంది.

తాను బయటకు వెళ్లినప్పుడు వచ్చి ఆఫీసుపై దాడి చేశారని తీన్మార్ మల్లన్న తెలిపారు. బీఆర్ఎస్ గుండాలే ఈ దాడికి పాల్పడ్డారని మలన్న ఆరోపించారు. నెంబర్ ప్లేట్ లేని మూడు కార్లలో వచ్చి దాడి చేశారని మల్లన్న చెప్పారు. పోలీసులకు తెలిసే దాడి జరిగిందని, ఇందులో పోలీసుల పాత్ర కూడా ఉందన్నారు. గతంలో జరిగిన దాడికి సంబంధించి ఒక్కర్ని కూడా పోలీసులు పట్టుకోలేదని మల్లన్న అన్నారు.