కేటీఆర్ ఫై బీజేపీ ఎంపీ ధర్మపురి విమర్శలు

తెరాస మంత్రి కేటీఆర్ ఫై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. ఉత్తర కుమారుడు, తుపాకీ రాముడు, బుడ్డార్ ఖాన్ లను కలిపితే ఒక కేటీఆర్ అని..తంబాకు టెస్ట్ కు బండి సంజయ్ రెడీ… ఆయనను నేను తీసుకొస్తా… కొకైన్ టెస్ట్ కి నివ్వు వస్తావా..? అంటూ కేటీఆర్ కు సవాల్ చేశారు. మనిషి పిచ్చికుక్కను కరిస్తే కేటీఆర్ లాగే ఉంటాడని సటైర్ విసిరారు.

టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శించారు. అయ్యా కొడుకులది ఉత్త ప్రచారం మాత్రమేనని.. చేయని పనులు కూడా చేసినట్లు చెప్పి కేటీఆర్ డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు. కేంద్రం తెలంగాణలో 3 లక్షల 94 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అరవింద్ అన్నారు. నేను చెప్పింది తప్పు అయితే కేటీఆర్ చెప్పింది చేస్తా అని… కరెక్ట్ అయితే కేటీఆర్ ని ఎడమకాలి చెప్పుతో తొక్కుతా అంటూ సంచలన విమర్శలు చేశారు. కేటీఆర్ నిజాయితీ పరుడు అయితే…111 జీవో విరుద్ధంగా జన్వాడలో కట్టిన నిర్మాణాలను కూల్చాలని సవాల్ చేశారు.

తెలంగాణలో బియ్యం బ్లాక్ మార్కెట్ పై సీబీఐ విచారణకు ఎన్ఓసీ ఇచ్చే దమ్ము కేటీఆర్ కు ఉందా అని అర్వింద్ ప్రశ్నించారు. బండి సంజయ్ పాలమూరులో యాత్ర చేస్తున్నాడని ఎద్దేవా చేసిన కేటీఆర్.. తన నియోజకవర్గం సిరిసిల్లను వదిలి హనుమకొండలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తాయని.. ఈ మాట నూటికి నూరుశాతం నిజమవుతుందని అన్నారు.