డెక్సామిథాసోన్ వాడకానికి డబ్ల్యూహెచ్వో అనుమతి
ఉత్పతత్తిని వేగవంతం చేయాలి.. టెడ్రోస్ అధనామ్ గాబ్రియోస్
జెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తి విలయతాండవం చేస్తుంది. ఈనేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక నిర్ణయం తీసుకున్నది. స్టెరాయిడ్ డెక్సామిథాసోన్ వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. జెనీవాలో జరిగిన ఒక వర్చువల్ న్యూస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గాబ్రియోస్.. బ్రిటిష్ ట్రయల్స్లో డెక్సామిథాసోన్ మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు నిరూపితమైందన్నారు. అందుకే ఆ ఔషధానికి డిమాండ్ బాగా పెరిగిందని, అందువల్ల డెక్సామిథాసోన్ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయన సూచించారు. గత వారం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బృందం నేతృత్వంలోని పరిశోధకులు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రెండు వేల మంది రోగులకు డెక్సామిథాసోన్ ఇచ్చారు. ఇది మరణాల సంఖ్యను 35 శాతం తగ్గించింది.
డెక్సామిథాసోన్పై పరిశోధనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా ఈ ఔషధానికి కరోనా వైరస్ తీవ్రంగా ప్రభావం చూపిన రోగుల ప్రాణాలను రక్షించే సామర్థ్యం ఉందని నిరూపితమైందని, అందుకే ఈ ఔషధం వాడకానికి అనుమతిస్తున్నామని టెడ్రోస్ వెల్లడించారు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/