‘నేను అరవింద్‌ కేజ్రీవాల్‌ను..ఉగ్రవాదిని కాదు’ అంటూ కేజ్రీవాల్‌ లేఖ

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ..దేశ ప్రజలను ఉద్దేశించి లేఖ రాసారు.ఆ లేఖను ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ఓ మీడియా సమావేశంలో చదివి వినిపించారు. దుర్మార్గం, పగతో బీజేపీ కేజ్రీవాల్‌ను కుంగదీయాలని చూస్తోందని ..వీటన్నింటిని ఎదుర్కొని ఆయన గొప్ప శక్తిగా మారతారని
సంజయ్‌ సింగ్‌ అన్నారు.

పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కలిసేందుకు వెళ్లినప్పుడు కేజ్రీవాల్‌ను ఉగ్రవాది మాదిరిగా గాజుగోడ మధ్య నిలబెట్టారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల బాండ్లను సమర్థించిన ప్రధాని మోడీ సుప్రీం కోర్టు తీర్పును కూడా లెక్క చేయకుండా అవమానించారని , సుప్రీం కోర్టుకు, దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని సంజయ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు.