సరికొత్త రంగుల్లో APSRTC బస్సులు

APSRTC సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సుల రంగులను అధికారులు మారుస్తున్నారు. గతంలో సూపర్ లగ్జరీ బస్సుకు తెలుపు, ఎరుపు, పసుపు రంగులు ఉండగా, ఇప్పుడు నీలం, లేత ఊదా రంగులతో రూపొందిస్తున్నారు. ఊదా, నీలం, తెలుపు రంగుల్లో ఉన్న అల్ట్రా డీలక్స్ బస్సులను తెలుపు, నీలం, ఆరెంజ్ కలర్లలోకి మార్చుతున్నారు. ప్రస్తుతం విజయవాడలో సిద్ధంగా ఉన్న 30 కొత్త బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.