హైదరాబాద్ః తెలంగాణలోని లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను ప్రకటించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జులుగా రాష్ట్ర అధ్యక్షుడు, కిషన్రెడ్డి బాధ్యతలు అప్పగించారు.
లోక్సభ స్థానాలకు బిజెపి ఇన్ఛార్జ్లు వీరే..
.హైదరాబాద్- రాజాసింగ్ .సికింద్రాబాద్- ఎంపీ లక్ష్మణ్ .మల్కాజిగిరి- పైడి రాకేశ్ రెడ్డి .చేవెళ్ల- ఏవీఎన్ రెడ్డి .నిజామాబాద్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి .ఖమ్మం- పొంగులేటి సుధాకర్ రెడ్డి .మహబూబాబాద్- గరికపాటి మోహన్రావు .పెద్దపల్లి- రామారావు పాటిల్ .వరంగల్- మర్రి శశిధర్ రెడ్డి .కరీంనగర్- సూర్యనారాయణ గుప్తా .జహీరాబాద్- కాటిపల్లి వెంకటరమణ రెడ్డి .నల్లగొండ- చింతల రామచంద్రారెడ్డి .భువనగిరి- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్