సంక్రాంతి సెలవులను మరోసారి మార్చిన ఏపీ సర్కార్

ఏపీ సర్కార్ మరోసారి సంక్రాంతి సెలవుల్లో మార్పు చేసింది. ముందుగా జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ఉండగా, వీటిని 12 నుంచి 17వ తేదీ వరకు మార్పులు చేశారు. ఇక ఇప్పుడు ఈనెల 18వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు తెలిపింది.

తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులను ఫిక్స్ చేసింది. తెలంగాణ లో 13 నుండి 17 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా..ఏపీ సర్కార్ 12 నుండి 17 వరకు సెలవులను ప్రకటించింది. ముందుగా జనవరి 11 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించింది. కానీ ఇప్పుడు సెలవుల్లో మార్పు చేసింది.