ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
ఎన్నికలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
![AP High Court orders suspending ZPTC, MPTC elections](https://www.vaartha.com/wp-content/uploads/2021/04/ap-High-Court-orders-suspending-ZPTC-MPTC-elections-1024x583.jpg)
Amaravati: రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు లో చుక్కెదురైంది. పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని హైకోర్టు పేర్కొంది.
ఏప్రిల్ ఒకటవ తేదీన ఎస్ఈసీ జారీచేసిన నోటిఫికేషన్ , తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్కు, పోలింగ్కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.
తాజా బిజినెస్ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/