చంద్రబాబు బెయిల్ పిటిషన్.. ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు సూచన

ap-high-court-key-suggestion-to-govt-in-chandrababu-bail-plea-hearing

అమరావతిః ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలను వినిపిస్తూ… చంద్రబాబును అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. కేసుల విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ…. ఈ విషయంపై హోంశాఖ, సీఐడీతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ తరపు న్యాయవాదికి సూచించింది. భోజన విరామం తర్వాత తదుపరి విచారణను చేపడతామని చెప్పింది.