టైగర్ నాగేశ్వరరావు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పై ఐటీ శాఖ దాడులు

it-raids-on-producer-abhishek-agarwal-office

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కార్యాలయంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. లావాదేవీలు, పన్ను చెల్లింపుల రికార్డులను ఆదాయపుపన్ను శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. కాశ్మీర్‌ ఫైల్స్‌, కార్తికేయ-2 వంటి పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలను ఆయన నిర్మించిన విషయం తెలిసిందే.

తర్వలో విడుదల కానున్న హీరో రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాకు కూడా ఆయనే నిర్మాత. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. అయితే సినిమా విడుదలకు కొన్ని రోజుల మందే నిర్మాత కార్యాలయంలో ఐటీ సోదాలు చేస్తుండటం గమనార్హం.