ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ అరూప్ గోస్వామి
రాష్ట్రపతి ఆమోదముద్ర
![Justice Arup Goswami as AP High Court CJ](https://www.vaartha.com/wp-content/uploads/2021/01/Justice-Arup-Goswami-as-AP-High-Court-CJ-1024x583.jpg)
New Delhi: ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి నియమితులయ్యారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ నియామకానికి ఆమోదముద్ర వేశారు. ప్రస్తుత చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా వెళ్లనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఈరోజు గెజిట్ ను విడుదల చేసింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/