ఇడుపులపాయ నుంచి బద్వేలు బయలేర్దిన సీఎం జగన్‌

వైఎస్సార్‌ జిల్లా: సీఎం జగన్ రెండు రోజు పర్యటనలో భాగంగా ఇడుపులపాయ నుంచి బద్వేలు బయలుదేరారు. బద్వేలులో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. బద్వేలుతో పాటు కడప నియోజకవర్గంలోను సీఎం పర్యటించనున్నారు. రెండు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. రెండుచోట్లా బహిరంగ సభల్లో పాల్గొంటారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/