కృష్ణ పట్నం మందు పంపిణీ చేయాలన్న పిటిషన్ల పై విచారణకు హైకోర్టు అనుమతి

27న విచారణ చేపట్టన్నట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టీకరణ

Krishnapatnam Ayurvedic medicine
Krishnapatnam Ayurvedic medicine

Amaravati: కృష్ణ పట్నంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల విచారణకు ఏపీ హైకోర్టు అనుమతించింది. ఈ నెల 27న విచారణ చేపట్టన్నట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. మందు పంపిణీకి ప్రభుత్వం ఖర్చులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని పిటిషనర్లు కోరారు. లోకాయుక్త ఆదేశాల ప్రకారం మందు పంపిణీ అపారని పోలీసులు చెబుతున్నారని లోకాయుక్తకి ఆ అధికారం లేదని పిటిషనర్ పేర్కొన్నారు. మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఏ ఆదేశాలు లేకుండా ఆపటం సరికాదని, ఆర్డర్ ఇవ్వకుండా ఆపటం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/