రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలియజేసింది. ఖరీఫ్ సీజన్ కోసం మే 20వ తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 16.19 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై 50 శాతం అలాగే వేరుశనగపై 40 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.

దీనికి 450 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం. 195 కోట్ల సబ్సిడీ భరించనుంది. పచ్చి రొట్ట, చిరుధాన్యాల విత్తనాల పై 50% అలాగే వేరుశనగ పై 40% సబ్సిడీ ఇవ్వనుంది. NFSM పరిధిలోని జిల్లాల్లో వరి విత్తనాలు క్వింటాల్ 1000 రూపాయలు, మిషన్ పరిధిలో లేని జిల్లాలలో 500 రూపాయల చొప్పున సబ్సిడీ ఇస్తారు. ఈ మేరకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.