ఉత్తమ సీఎంల జాబితాలో ఏపీ సీఎం జగన్ 3వ స్థానం
ఏబీసీ- సీవోటర్ సర్వే
Amravati: దేశంలోనే ఉత్తమ సీఎంల జాబితాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 3వ స్థానంలో నిలిచారు. ఏబీసీ- సీవోటర్ సంస్థలు దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రులు ఎవరన్న అంశమై దేశ్ కామూడ్ పేరిట సర్వే నిర్వహించాయి.
ఈ సర్వేలో దేశంలో ఉత్తమ పాలన నిర్వహిస్తున్న సీఎంల జాబితాలో జగన్ కు మూడో స్థానం దక్కింది. ఓడిశా సీఎం నవీన్ పట్నాయక్ తొలి స్థానంలో ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/