ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ
న్యూఢిల్లీ : సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పర్యటన భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో చర్చించనున్నారు.
కాగా, సీఎం జగన్ చెందిన ఢిల్లీ నివాసం వద్ద మంగళవారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కోసం మంగళవారం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రానికే జగన్ ఢిల్లీ చేరుకోగా… జగన్ ఢిల్లీ చేరుకోవడానికి కాస్తంత ముందుగా జగన్ నివాసం ఉన్న జనపథ్ పరిసరాల్లో వాహనాల రాకపోకలను రద్దు చేశారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/