రేపటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

రేపటి నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ పని దినాలను ఖరారు చేయనుంది. ఇవే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు కావడంతో ఈ బడ్జెట్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఇక ఈనెల 18న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. శనివారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. 2 లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.

అలాగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్ కీలక అంశాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. నాలుగేళ్ల పాలనలో మూడు రాజధానులు.. సంక్షేమం.. విశాఖ గ్లోబల్ సమిట్ వంటి ముఖ్యమైన జగన్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ నెల 27 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం.