ఏపీ అసెంబ్లీ వాయిదా..
ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైన కాసేపటికే స్పీకర్ అసెంబ్లీ ని వాయిదా వేశారు. అసెంబ్లీ ప్రారంభం కాగానే టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్పై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, పోడియం ను చుట్టుముట్టారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుండగానే.. టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, స్పీకర్ స్థానం వద్దకు వెళ్ళి ప్లకార్డులు చూపించారు. మీ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని స్పీకర్ కోరడం జరిగింది. స్కిల్ కేస్ అక్రమ కేస్ అని ప్లకార్డులు పట్టుకొని , అక్రమ అరెస్ట్ను ఖండించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ అసెంబ్లీ ని కాసేపు వాయిదా వేశారు.