ఈ బిల్లుతో మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందు ఉంటారుః మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ : రెండు దశాబ్దాలకు పైగా పెండింగ్లో ఉన్న మహిళా బిల్లును ఎట్టకేలకు లోక్సభలో ప్రవేశపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈ బిల్లుతో మహిళలు కూడా రాజకీయ రంగంలో ముందు ఉంటారని, దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషిస్తారని, మహిళా సాధికారిక సాధ్యమవుతుందని అన్నారు. మహిళా బిల్లు ఆమోదం పొందటం దేశానికే గర్వకారణం అని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృషి ఎంతో ఉందన్నారు. ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో బుధవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు.