శ్రీ చైతన్య కాలేజ్ లో చదువుతున్న మరో స్టూడెంట్ ఆత్మహత్య

ఇప్పటికే నార్సింగ్ లోని శ్రీ చైతన్య కాలేజ్ లో చదువుతున్న సాత్విక్ అనే ఇంటర్ విద్యార్థి యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకోగా..ఇక ఇప్పుడు మరో స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఎస్ సదన్ పరిధిలోని SBI కాలనీలో సదరు దంపుతులు నివాసం ఉంటున్నారు. భర్త ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తుండగా, భార్య ఓ కాలేజీలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తుంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ఇతడు చైతన్య పురిలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. అయితే గత మూడు నెలల నుంచి ఆమె కుమారుడు.. అర్థరాత్రి వరకు ట్యాబ్ చూస్తూ సరిగ్గా నిద్రపోవడం లేదు. దీనిని గమనించిన అతని తల్లి.. బుధవారం రాత్రి కుమారుడి నుంచి ట్యాబ్ తీసుకెళ్లింది. దీంతో ఆ బాలుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

తల్లి బయటకు వెళ్లగానే కుమారుడు.. వారు ఉంటున్న బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం గా మారింది. ఇదే కాదు ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఇటీవల చిన్న చిన్న వాటికే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఫోన్ కొనివ్వలేదని , తల్లిదండ్రులు మందలించారని , వారు అడిగింది ఇవ్వలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఇది కూడా అలాంటిదే.