దళిత సీఎం గురించి ఎప్పుడు మాట్లాడుకున్నామో చెప్పాలి

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే..: షబ్బీర్ అలీ

హైదరాబాద్: సీఎం కెసిఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. మేమే కేసీఆర్ ను దళితుడిని ముఖ్యమంత్రిని చేయనివ్వలేదని షబ్బీర్ అలీ చెప్పారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై షబ్బీర్ మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదనే విషయాన్ని కేసీఆర్ సిగ్గులేకుండా ఒప్పుకున్నారని అన్నారు.

అయితే, ఈ వ్యవహారంలో తన పేరును లాగడం సరికాదని చెప్పారు. అసలు దళిత ముఖ్యమంత్రి గురించి ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నామో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. తాను ఇచ్చే సలహాలను వింటున్నట్టు కేసీఆర్ నటిస్తున్నారని మండిపడ్డారు. మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే… తన సలహాలను మీరు వినేటట్టయితే… వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి, దళితుడికి ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించాలని అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/