ఏపీలో మరో కోడి కత్తి దాడి..

కోడి కత్తి దాడి అంటే తక్కువ సీఎం జగన్ గుర్తుకొస్తారు. ప్రతిపక్షనేతగా ఉన్న టైం జగన్ వైజాగ్ నుండి హైదరాబాద్ కు వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే.. ఎయిర్ పోర్టు క్యాంటీన్‌లో పని చేసే శ్రీను అనే వ్యక్తి.. చిన్న కోడికత్తితో దాడి చేశాడు. అప్పట్లో ఈ దాడి పెద్ద సంచలనం రేపింది. అప్పటి నుండి ఇంకా ఈ కోడి కత్తి దాడి వార్తల్లో నిలుస్తూనే ఉంది.

తాజాగా మరోసారి ఏపీలో కోడి కత్తి దాడి జరిగింది. అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలంలో ఈ ఘటన జరిగింది. రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం కి చెందిన చేపల నానాజీ..నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానంటూఓ యువతిని వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించడంతో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాలలో ఆమె ఫోటోలు పెట్టి తన భార్యగా ప్రచారం చేశాడు. గతంలో యువతి పెద్దల దృష్టికి తీసుకెళ్లగా ఇకపై ఇబ్బంది పెట్టను అని 2020 మార్చి 24న లికిత పూర్వకంగా రాసి ఇచ్చాడు యువకుడు.అయినప్పటికీ మారకుండా ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు యువకుడు. ఇక బుధవారం రాత్రి యువతీ ఇంటికి వచ్చి యువకుడు హల్చల్ చేశాడు. ఈ క్రమంలో ఆమె ఫై కోడి కత్తితో దాడి చేసాడు. అడ్డువచ్చిన ఆమె తల్లిపై ఇనుపురాడ్డు తో దాడి చేశాడు. స్థానికులు అడ్డుకోవడం తో అక్కడి నుండి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.