ఐటీ కారిడార్​లో మరో ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం

హైదరాబాద్ మహానగరం లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు GHMC ఎప్పటికప్పుడు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఏర్పటు చేస్తూ వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ఎన్నో ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ప్రారంభించింది. ఇక ఇప్పుడు మరో ఫ్లైఓవర్ బ్రిడ్జి, అండర్​పాస్​ అందుబాటులోకి రానుంది. ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్​ రద్దీ నుంచి కొంత మేర ఉపశమనం లభించనుంది. కొండాపూర్​ నుంచి కొత్తగూడ జంక్షన్​మీదుగా బొటానికల్ ​గార్డెన్​ వరకు నిర్మిస్తున్న ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్​లో అండస్​పాస్​పనులు 95 శాతం పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫ్లైఓవర్​ కింద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 25 లోపు పనులు కంప్లీట్​ చేయాలని ప్లాన్​ చేస్తున్న అధికారులు మంత్రి కేటీఆర్​తో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

కొండాపూర్​ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్​వరకు 2.2 కి.మీ. మేర ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్​ వద్ద అండర్​పాస్ ​నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో శ్రీకారం చుట్టింది. రూ.199 కోట్ల నిధులు కేటాయించింది. 2020 ఏప్రిల్ నాటికి పనులు కంప్లీట్​ చేసి అందుబాటులోకి తీసుకురావాలని మొదట భావించగా, మధ్యలో కొవిడ్, ఆస్తుల సేకరణ కారణంగా ఆలస్యమైంది. ఈ ఆలస్యం కారణంగా ప్రాజెక్టు వ్యయం రూ.199 కోట్ల నుంచి రూ.263 కోట్లకు చేరింది. జనవరి నెలలో ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కానుంది.