మరో వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్

మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదంలో నిలిచారు. రీసెంట్ గా మహబూబాబాద్ మున్సిపాలిటీకి సీఎం కేసీఆర్ రూ. 50 కోట్ల నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ నిధుల వినియోగంపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపాలిటీకి విడుదలైన నిధులపై ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెత్తనం చలాయిస్తున్నారని వారంతా వాపోతున్నారు. ప్రతి వార్డుకు కోటి చొప్పున నిధులను కేటాయించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ కు వినతీపత్రం అందజేశారు.