ఎమ్మెల్యేల కొనుగోలు కేసు : నిందితుడు రామచంద్ర భారతిపై మరో కేసు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మపై మరో కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం రామచంద్ర భారతిపై తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించి రామచంద్ర భారతి నకిలీ కార్డులను తయారు చేసుకున్నారంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రామచంద్ర భారతిపై బంజారా హిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ కేసులో దోషిగా తేలితే రామచంద్ర భారతికి పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రాచమంద్రభారతి, సింహాయాజి, నందకుమార్లో చంచల్గూడ జైల్లో ఉన్న విషయం విదితమే.