కల్లు రుచి చూసిన మంత్రి ఎర్రబెల్లి..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కల్లు రుచి చూసాడు. మంగళవారం పాలకుర్తి నియోజకవర్గంలోని వల్మీడి గ్రామంలోరూ. 6 కోట్లతో అభివృద్ధి చేస్తున్న రామాలయాన్ని మంత్రి సందర్శించారు. రామాలయ పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. అనంతరం వల్మీడి నుంచి తిరిగి వస్తుండగా.. మార్గమధ్యంలో గీత కార్మికులు ఎదురుపడ్డారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి వారి మండవ వద్దకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
కల్లు బాగా పారుతోందా? లాభసాటిగా ఉంటోందా? పెన్షన్లు, బీమాలు అందుతున్నాయా? అని ఆరా తీశారు. ఇదే సమయంలో మంత్రిని తమ కల్లు రుచి చూడాలని కోరారు. దీంతో గీత కార్మికుల కోరిక మేరకు, మంత్రి ఎర్రబెల్లి కల్లు రుచి చూసి, కల్లు బాగుందంటూ గీత కార్మికులకు తెలిపారు. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించడంతో టిఆర్ఎస్ నేతలు , శ్రేణులు సంబరాల్లో ఉన్నారు. కేసీఆర్ జాతీయ ఎంట్రీ టైములో మునుగోడు విజయం బూస్ట్ ని ఇచ్చిందని అంత భావిస్తున్నారు.