గుజరాతీయులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
గుజరాతీయులపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గుజరాతీలకు ఎంటర్ప్రెన్యూ ర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, వారి నుంచి ఇతర ప్రాంతాల ప్రజలు ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 1 నుంచి నిర్వహించనున్న ప్లాస్ట్ ఇండియా-2023 ఎగ్జిబిషన్కు సంబంధించిన యాప్ను శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని తాజ్కృష్ణాలో ఆవిష్కరించారు.
ఈ సందర్భం గా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గుజరాతీలకు ఎంటర్ప్రెన్యూ ర్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని, వారి నుంచి ఇతర ప్రాంతాల ప్రజలు ఎంతో నేర్చుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఎంటర్ప్రెన్యూర్కు ఎక్కువ ప్రాధా న్యం ఇస్తారని చెప్పారు. కానీ మన దేశంలో ఇంజినీర్, డాక్టర్, సీఏ, లాయర్ మరేదో కావాలని తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు సూచిస్తారని, ఎంటర్ప్రెన్యూర్గా మారాలని ఎవరూ చెప్పరని పేర్కొన్నారు.
ఇండియాలో ఎంటర్ప్రెన్యూర్ కావడం అంత సులువు కాదన్నారు. దేశంలో ఎవరైనా వ్యాపారవేత్తగా మారితే ఆయన వెనక ఎవరు ఉన్నారు? మంత్రి ఉన్నా డా? ఏ నాయకుడు ఉన్నాడు? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తారని పేర్కొన్నారు. గుజరాతీయుల రక్తంలోనే ఎంటర్ప్రెన్యూర్ లక్షణాలు ఉన్నాయని, అక్కడి నుంచే పెద్దపెద్ద వ్యా పారవేత్తలు వచ్చారని తెలిపారు. 1987 నాటికి భారత్, చైనా జీడీపీ ఒకే విధంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు చైనా జీడీపీ 16 ట్రిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు. మన దేశంలో అనుకున్నం త స్థాయిలో మార్పు జరగలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మనం ఎందుకు వెనకబడ్డామో, చైనా సాధించినది మనం ఎందుకు సాధించలేకపోయామో ఆలోచించాలని కేటీఆర్ కోరారు.