హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో విషాద ఘటన..
శనివారం హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్లో విషాద ఘటన చేసుకుంది. ఏనుగు కు కేర్ టేకర్ (మావటి) ఆహారం పెడుతుండగా..అకస్మాత్తుగా వెనుక నుంచి దాడి చేసింది. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన కేర్ టేకర్.. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. సాధారణంగా ఏనుగుల సఫారీలో ఐదారుగురు కేర్ టేకర్లు (మావటిలు) విధుల్లో ఉంటారు. అయితే, శనివారం జూ పార్క్లో 60 సంవత్సరాల వేడుకలు నిర్వహిస్తున్నారు.
దీంతో కొంత మంది సిబ్బంది అక్కడి విందులో పాల్గొన్నారు. ఆ సమయంలో ఏనుగుల సఫారీలో షాబాజ్ (28) ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఆహారం అందించేందుకు వెళ్లిన షాబాజ్పైకి ఏనుగు దూసుకొచ్చి, తొండంతో అతడిని అమాంతం ఎత్తి నేలకేసి కొట్టింది. అనంతరం కాలితో తొక్కింది. తీవ్ర గాయాలై కొనఊపిరితో ఉన్న షాబాజ్ను తోటి సిబ్బంది వెంటనే డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.