విశాఖలో టిడిపి-వైఎస్‌ఆర్‌సి..తీవ్ర ఉద్రిక్తత

టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి పోటాపోటీ నినాదాలు..

visakhapatnam
visakhapatnam

విశాఖపట్నం: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో విశాఖలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను వ్యతిరేకిస్తున్న చంద్రబాబును వైజాగ్‌లో అడుగుపెట్టనీయబోమని వైఎస్‌ఆర్‌సిపి శ్రేణులు ఆందోళనలు చేస్తున్నాయి. విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొని చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అటు చంద్రబాబుకు వెల్‌కమ్ చెప్పేందుకు టిడిపి శ్రేణులు కూడా భారీగా తరలిచ్చాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పోలీసు రంగంలోకి చెదరగొట్టారు. ముందుజాగ్రత్తగా ఎయిర్‌పోర్టు పరిసరాల్లో భారీగా మోహరించారు. వైఎస్‌ఆర్‌సి, టిడిపి ఆందోళనల నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్టు రోడ్డులో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

అంతకుముందు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గణేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కారులో నుంచి ఎమ్మెల్యే అనుచరులను దించి అక్కడి నుంచి పంపించారు. కాగా, చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టులో దిగిన తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా పెందుర్తి వెళ్లాలని టీడీపీ భావించింది. కానీ ర్యాలీకి విశాఖ పోలీసులు అనుమతించలేదు. పెందుర్తి భూసమీకరణ బాధితులను పరామర్శించే కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతులను మాత్రమే మంజూరు చేసింది. చంద్రబాబు వెంట ఎమ్మెల్యేలు, ఇతర నేతలు 50 మందికి మించి ఉండరాదని స్పష్టం చేశారు. ఐతే టిడిపి నేతలు మాత్ర ర్యాలీ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/