జగన్ గో బ్యాక్ అంటేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుంది
హుద్ హుద్, తీత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వలేదు
అమరావతి: టిడిపి జాతీయ కార్యదర్శి నారాలోకేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దోపిడీ ప్రణాళిక తప్ప, అభివృద్ధి ప్రణాళిక లేకుండా చెత్త కమిటీలతో ఉత్తరాంధ్రకి వ్యతిరేకంగా రిపోర్టులు రాయించి చావు దెబ్బ కొట్టిన ముఖ్యమంత్రి జగన్ గో బ్యాక్ అంటేనే ఉత్తరాంధ్ర బాగుపడుతుందన్నారు. ఇంకా మరో ట్వీట్లో హుద్ హుద్, తీత్లీ వచ్చినప్పుడు మంచినీళ్లు ఇవ్వడానికి కూడా రాని వ్యక్తి ఇప్పుడు ఉత్తరాంధ్రని ఉద్ధరిస్తారా? అని ప్రశ్నించారు. వోక్స్ వ్యాగన్ సొమ్ముల్లానే హుద్ హుద్ సమయంలో సహాయం కోసం వైఎస్ జగన్గారు ఇచ్చాను అంటున్న రూ. 50 లక్షలు పోనాయి ఏటి సేత్తా మని ఉత్తరాంధ్ర భాషలో నారా లోకేష్ ఎద్దేవా చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/