హరిరామ జోగయ్యకు మంత్రి అమర్ మరో లేఖ

సినీ రాజకీయ నేత హరిరామ జోగయ్య కు మంత్రి గుడివాడ అమర్ నాధ్ మరో లేఖ రాసారు. రీసెంట్ గా మంత్రి అమర్ నాధ్ కు హరిరామ ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. నువ్వు రాజకీయాల్లో బచ్చావి, పైకి రావాల్సిన వాడివని, సాధారణ మంత్రి పదవికి అమ్ముడు పోయి కాపుల భవిష్యత్తు నాశనం చేయకని , అలాగే అనవసరంగా పవన్ కళ్యాణ్ పై బురద చల్లే ప్రయత్నం చేయకు..నీ మంచి కోరి చెబుతున్నానని లేఖ లో రాయడం జరిగింది.

దీనికి మంత్రి అమర్ స్పందించి రిప్లయ్ ఇచ్చారు. ‘కాపుల భవిష్యత్తు విషయంలో చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కల్యాణ్ గారికి రాయాల్సిన, చెప్పాల్సిన విషయాలు పొరబాటున నాకు రాసినట్టున్నారు. మీకు ఆయురారోగ్యాలు కలగాలని, మీరు మానసికంగా దృఢంగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’ మంత్రి అమర్ నాధ్…హరిరామ జోగయ్య లేఖకు స్పందించారు. ఇక ఇప్పుడు మరో లేఖ హరిరామ జోగయ్య కు మంత్రి అమర్ నాధ్ రాసారు. ‘గౌరవనీయులైన హరిరామ జోగయ్య గారికి.. వంగవీటి మోహన రంగా గారిని చంపించినది చంద్రబాబు నాయుడే అని మీరు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అలాంటి చంద్రబాబుతో పొత్తులకు సిద్ధమైన పవన్ కళ్యాణ్‌ను మీరు సమర్థిస్తారా.. స్పష్టం చేయగలరు’అంటూ రెండో లేఖ రాశారు. మరి దీనిపై హరిరామ జోగయ్య ఎలా స్పందింస్తారో చూడాలి.