బోరుగడ్డ అనిల్ కుమార్ పార్టీ ఆఫీస్ ను తగలబెట్టిన దుండగులు

రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ పార్టీ కార్యాలయం కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. అర్థరాత్రి సమయంలో గుంటూరు డొంకరోడ్డులో ఉన్న ఆఫీసును దుండగులు తగులబెట్టారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలు ఆర్పారు.

ఈ ఘటనలో ఫర్నిచర్‌ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అయితే ఇది స్థానిక టీడీపీ నాయకులపనేనని ఆరోపిస్తున్నారు అనిల్‌ కుమార్‌. ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల బోరుగడ్డ అనిల్.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి అనిల్ ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చగా మారింది. ఈ నేపథ్యంలో అనిల్ ఆఫీస్ కి కొంతమంది నిప్పు పెట్టారు.

ఈ ఘటనలో కార్యాలయంలో ఉన్న సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. కాగా ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు వచ్చి పెట్రోల్ పోసి ఆఫీస్ కి నిప్పు పెట్టి.. అనంతరం తనపై దాడి చేసినట్లు వాచ్ మేన్ ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోటంరెడ్డి మీద, టీడీపీ నేతల మీద అనిల్ ఆరోపణలు చేస్తున్నారు.