హైదరాబాద్ లో 58 అంతస్థులు భవనం.. దక్షిణ భారత్​లోనే అతి పెద్ద భవనం ఇదే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఐటీ కంపెనీ లు హైదరాబాద్ లో పెట్టుబడి పెడుతూ..లక్షలాది మందికి ఉపాధి కలిపిస్తున్నాయి. దీంతో మరింతగా అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా హైటెక్ సిటీ , గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు అమెరికా ను తలిపించేలా తయారుఅవుతున్నాయి. తాజాగా ఇప్పుడు హైదరాబాద్ మరోసారి వార్తల్లో నిలిచింది.

దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద బహుళ అంతస్థుల భవనం హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో నిర్మితమవుతున్నది. కోకాపేటలో ‘సాస్‌ క్రౌన్‌’ పేరిట 58 అంతస్థులు, 236 మీటర్ల ఎత్తుతో ఈ ఆకాశ హార్మ్యాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సుమారు 100 ఎత్తు.. 24 అంతస్థుల నిర్మాణం పూర్తయింది. మిగిలిన 136 మీటర్ల నిర్మాణం మరో ఏడాదిలో పూర్తి కానున్నట్టు తెలుస్తోంది. ఐటీ కారిడార్‌లో ఇప్పటికే పలు భారీ భవనాలు ఏర్పాటయ్యాయి. 57, 56, 52, 50 అంతస్థులతో కూడిన భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే, 58 అంతస్థులతో సాస్ క్రౌన్ దక్షిణ భారతంలోనే అతి పెద్ద భవనంగా రికార్డు సృష్టించనుంది.