బలగం చూస్తూ కన్నీరు పెట్టుకుంటున్న ప్రేక్షకులు

మాతృదేవోభవ ఈ సినిమా చూసి కన్నీరు పెట్టుకొని వారు ఉండరు..మళ్లీ అలాంటి ఘటన ఇప్పుడు బలగం సినిమా చేస్తుంది. వేణు డైరెక్షన్లో ప్రియదర్శి (సాయిలు), కావ్య కళ్యాణ్ రామ్, కేతిరి సుధాకర్‌ రెడ్డి (హీరో తాత), కోట జయరాం (ఐలయ్య, హీరో తండ్రి), ఐరేని మురళీధర్‌ గౌడ్‌ (నారాయ‌ణ), రూపాలక్ష్మి (హీరో మేన‌త్త) మైమ్ మధు (మొగిలి) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పుడు అందర్నీ కంటతడి పెడుతుంది. బంధుత్వాలను కలిపే కధాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా విడుదలై నెల రోజులు కావొస్తున్నా ఇంకా ఈ సినిమా గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సినిమాలను థియేటర్‌లోనే ఎక్స్‌పీరియెన్స్‌ చేయాలనీ రిపీటెడ్‌ షోలు కూడా వేస్తున్నారు. ఇటీవలే ఓటీటీలో రిలీజైనప్పటికీ కూడా రోజుకు 50లక్షల కలెక్షన్‌లు వస్తున్నాయంటే ఈ సినిమా క్రేజ్‌ ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. చిన్న సినిమాగా విడుదలైన బలగం బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్‌లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక ఈ మధ్య పలు ఊర్లలో ఈ సినిమాను ఆరుబయట స్క్రీన్‌ను ఏర్పాటు చేసుకుని మరీ ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు.

తాజాగా ఓ ఊర్లో ఇలానే జనాలందరూ కలిసి స్క్రీన్‌ను ఏర్పాటుచేసుకుని సినిమాను వీక్షించారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్‌ చూసి కంటతడి పెడుతున్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు అని తేడా లేకుండా అందరూ ఎమోషనల్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమాను చూసిన వారు మళ్లీ ..మళ్లీ చూస్తూ కుటుంబాలకు దగ్గరవుతున్నారు.