కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ కొత్త ప్యాక్

డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ఏడాది చందా రూ. 399

airtel
airtel

ముంబయి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన కస్టమర్ల కోసం ఎయిర్ టెల్ ఆకర్షణీయమైన రీచార్జ్ ప్యాక్ ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ. 401 ప్రీపెయిడ్ ప్యాక్ తో రోజుకు 3 జీబీడేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. ఇదే సమయంలో ఏడాది పాటు డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ఉచితం. ఈ ప్యాక్ లో కాలింగ్, ఎస్ఎంఎస్ సదుపాయాలు ఉండవు. వాస్తవానికి డిస్నీ, హాట్ స్టార్ వీఐపీ ప్యాక్ చందా ఏడాదికి రూ. 399.ఇక ఎయిర్ టెల్ చందాదారులకు రోజుకు 3 జీబీ డేటాతో పాటు, ప్యాక్ ముగిసిన తరువాత కూడా ఏడాది పాటు చందా అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ ప్లాన్ ను తీసుకుంటే సరిపోతుందని, ఆపై ఏ ఇతర ప్లాన్ తో అయినా తమ ఫోన్ నంబర్ ను రీచార్జ్ చేసుకుని కాలింగ్, మెసేజ్ సదుపాయాన్ని పొందవచ్చని తెలిపింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/