మలక్‌పేట్‌లో దారుణం : ఇంటిముందు చెత్త వేసినందుకు మహిళపై హైకోర్టు అడ్వొకేట్ దాడి

తన ఇంటి ముందు చెత్త వేశారనే కోపం తో మహిళా అని కూడా చూడకుండా ఆమె ఫై దాడి చేసాడు హైకోర్టు అడ్వొకేట్. ఈ ఘటన మూసారాంబాగ్‌లోని సాయి నగర్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటన కు సంబదించిన వీడియో మీడియా లో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మూసారాంబాగ్‌లోని సాయి నగర్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న హైకోర్టు అడ్వొకేట్ ఆంటోని రెడ్డి అలియాస్ క్రాంతి రెడ్డి ..తన ఇంటి ముందు చెత్తవేశారంటూ ఓ మహిళ, యువకుడిపై దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న మహిళను బయటకు లాక్కొచ్చాడు. అతడిని అడ్డుకున్న వారిపై కూడా దాడికి దిగాడు. వారిపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ క్రమంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అడ్వొకేట్ దాడిలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. తమ ముఖాలపై పిడిగుద్దులు కురిపించాడని బాధితులు చెప్పుకొచ్చారు.