ఫ్యాన్సీ రేటుకు ఆదిపురుష్ నైజాం రైట్స్ దక్కించుకున్న యూవీ క్రియేషన్స్

ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ..జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతుంది. తాజాగా ఈ చిత్ర నైజాం రైట్స్ ను యువీ క్రియేషన్స్ వారు దక్కించుకున్నట్లు సమాచారం. సదరు సంస్థ దాదాపు రూ. 125 కోట్లు మొత్తాన్ని నిర్మాతల కు ముట్టజెప్పినట్లు తెలిసింది. ఇది ప్రభాస్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ అని ట్రేడ్ సమాచారం.

ఏకంగా రూ. 125 కోట్లు బిజినెస్తో తెలుగులో విడుదల కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీకి అత్యధిక థియేటర్లు కూడా దొరికే అవకాశం ఉంది. దీనికితోడు మంచి టాక్ వస్తే ఈ చిత్రం తక్కువ సమయంలోనే టార్గెట్ను చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.