ఆదిపురుష్ రన్ టైం..?

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ఆదిపురుష్. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి. ఇక ఈ సినిమాను జూన్‌ 16న పాన్‌ ఇండియా లెవల్లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నారు.

ఇక సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుండడం తో ప్రమోషన్ కార్యక్రమాలను చేయడంతో పాటు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ పనులను పూర్తి చేసుకున్నారని తెలిసింది. తద్వారా ఈ సినిమా ఫైనల్ కాపీని రెడీ చేశారని బీ టౌన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫైనల్ కాపీ 174 నిమిషాల నిడివితో కట్ చేశారట. అంటే 2 గంటల 54 నిమిషాల రన్‌ టైంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అంటున్నారు. మరి అంత నిడివి ఉన్న సినిమాను ప్రేక్షకులు చూడగలరా..అనేది ఇప్పుడు ప్రశ్న గా మారింది.