అదానీకి భారీ షాక్
సుమారు 45 వేల కోట్ల విలువైన షేర్లు ఫ్రీజ్
ముంబయి: అదానీ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. సుమారు 25 శాతం వరకు ఆ కంపెనీల షేర్లు పతనమైనట్లు తెలుస్తోంది. అదానీ గ్రూపుకు చెందిన సుమారు 43వేల కోట్ల విలువైన మూడు కంపెనీల విదేశీ నిధులను నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ సీజ్ చేయడంతో ఆ కంపెనీ షేర్లు డౌనయ్యాయి. అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీల నిధులను ఎన్ఎస్డీఎల్ నిలిపివేసింది. గత ఏడాది సుమారు 800 శాతం దూసుకువెళ్లిన అదానీ గ్రూపు ఇప్పుడు ఒకేసారి బోల్తాకొట్టింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం ఆ మూడు విదేశీ కంపెనీల వివరాలను ఆదానీ గ్రూపు వెల్లడించలేదు. దీంతో నేషనల్ సెక్యూరిటీస్ చర్యలు తీసుకున్నది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/